ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ డివిజన్ లో గణపారపు ఉమా భర్త ఉపేందర్ అనారోగ్య కారణాల వలన కార్పొరేట్ వైద్యం నిమిత్తం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిఫార్సు మేరకు క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సహకారంతో 60 వేల రూపాయల చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు భూక్యా సురేష్ నాయక్,వెంపటి రవి, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఎన్ పి చారీ,ఎర్ర.శేఖర్ రెడ్డి,కళ్లెం.శేష్ రెడ్డి,వెంపటి వెంకన్న, అప్పలనేని రాము, రమేష్, రంజిత్ నాయక్,అశోక్ రెడ్డి, కేశిరెడ్డి. సురేష్ రెడ్డి తదితరుల తదితరులు పాల్గొన్నారు.
పేదల పక్షాన పోరాడేది, పార్టీలకు అతీతంగా పనిచేసేది, కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు మరియు నిరుపేదలకు ఎప్పుడూ అందుబాటులో ముందుంటుందని వారు అన్నారు.









