ప్రైవేట్ వ్యక్తి సహకారంతో రూ.50,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు
జయకేతనం న్యూస్ జనవరి 06
ఫిర్యాదుధారుని యొక్క తండ్రి పేరున గల వ్యవసాయ భూమిని ఫిర్యాదుదారు ని పేరున నమోదు చేసేందుకు అనుకూలంగా ఉండేలా సంబంధిత అధికారులకు నివేదికను పంపేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.50,000/- లంచం ను కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి పేట మండల తహసీల్దారు యార్లగడ్డ శ్రీనివాసరావు ఒక ప్రయివేటు వ్యక్తి అయిన చిన్నూరి అజయ్ సహాయంతో తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణఅవినీతినిరోధకశాఖ వారి”టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి” అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106),ఫేస్బుక్ (Telangana ACB) ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana. gov.in) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. ఫిర్యాదుధారుల/బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని తెలిపారు.








