సూర్యాపేట జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా షేక్ సైదా నియామకం

సూర్యాపేట జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు షేక్ సైదా ను ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు
సుర్యాపేట జిల్లా జయకేతనం న్యూస్
సూర్యాపేట జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జర్నలిస్ట్ షేక్ సైదా ను సోమవారం జర్నలిస్టులు,టీజేఏ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీజేఏ సుర్యాపేట జిల్లా కోశాధికారి కొత్తపల్లి మధు సూధన్ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ తరపున సుర్యాపేటజిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యునిగా అవకాశం రావడం గర్వకారణమన్నారు. కమిటీ సభ్యునిగా ఉండేందుకు అతనికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అర్హులైన జర్నలిస్టుల హక్కుల కోసం యూనియన్ తరపున నిరంతరం పోరాటం చేయాలని సూచించారు. జర్నలిస్టు యొక్క హక్కులు కాపాడుటకు తన వంతు కృషి చేయాలన్నారు. జర్నలిస్టులకు బస్సు పాసులు పూర్వం మాదిరిగానే కొనసాగేందుకు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులందరూ ప్రయత్నం చేయాలన్నారు టీ.జే.ఏ. యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు రెండు పడకల గదులు లేదా ఇంటి స్థలం రైల్వే పాస్ పునరుద్ధరణ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లోజు నాగేంద్ర చారి, గోరంట్ల శ్రీనివాస్, భయ్యారపు రవీంద్ర, కొండమీది నరసింహారావు,మిద్దె రాకేష్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు








