జయకేతనం న్యూస్ ఆగస్టు 15
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాల రక్ష భవన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో బాలల పరిరక్షణ విభాగం యూనిట్ సిబ్బంది, బాలల సంక్షేమ సమితి సభ్యులు, మరియు చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావులను స్మరించుకుంటూ,పిల్లలకు దేశభక్తి, క్రమశిక్షణ, మరియు సమాజ సేవ ప్రాధాన్యతను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన సందేశాలు అందించారు.









