జయకేతనం న్యూస్ ఆగస్టు 24
ఉమ్మడి నల్లగొండ జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు (పిల్లల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ) ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కే. శిరీష, మరియు బోర్డు సభ్యులు డా.జి. మోహన్ రావు లు ఆదివారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం,ఆలయ ఈఓ నాగేళ్ళ శంబి రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ వారిని సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను వారికి వివరించారు.









