జయకేతనం న్యూస్ ఆగస్టు 31
తల్లి దండ్రులు కోల్పోయిన నిరుపేద కుటుంబానికి హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తండు సాయిరాం గౌడ్ చేయూత అందించారు. హుజూర్ నగర్ పట్ణణంలోని 24 వార్డుకు చెందిన పందిపోటు విజయ ఇటీవల అనారోగ్యం తో మరణించారు. కాగా అంతకుముందే ఆమె భర్త కూడా మరణించడంతో వారి పిల్లలు ఇరువులు తల్లి తండ్రులను కోల్పోయారు.కాగా దిక్కు తోచక స్తితిలో ఉన్న వారికి ఆదివారం 24 వార్డు కాంగ్రెస్ నాయకులు తండు సాయిరాం గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి బియ్యం అందజేశారు.కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు దివ్య,దుర్గా భవాని,పంది పోటు గోపయ్య,చల్లా రమేష్,పందిపోటు రవి,చింతల వెంకయ్య,పందిపోటు లక్ష్మల్,చల్లా శివ,పందిపోటు రవిశంకర్,చింతల కిరణ్,పందిపోటు గురవయ్య,చల్లా చిన రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.









