రంగారెడ్డి జిల్లా సంయుక్త సబ్ రిజిస్ట్రార్ (ఎస్ఆర్ఓ–1)గా పనిచేస్తూ సస్పెన్షన్లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డిపై అక్రమాస్తుల(డీఏ) కేసు నమోదు
నివాస గృహముతో పాటుగా వారి బంధువులు, స్నేహితులు మరియు ఇతర అనుచరులకు సంబంధించిన మరో ఏడు స్థలాల్లో సోదాలు చేసిన
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు.
జయకేతనం న్యూస్ జనవరి 23
రంగారెడ్డి జిల్లా సంయుక్త సబ్ కలెక్టర్ గా పని చేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డి పై అక్రమాస్తుల(డీఏ) కేసును ఏసీబీ అధికారులు నమోదు నమోదు చేశారు వారియొక్క నివాస గృహముతో పాటుగా వారి బంధువులు, స్నేహితులు మరియు ఇతర అనుచరులకు సంబంధించిన మరో ఏడు స్థలాల్లో సోదాలు నిర్వహించగా,ఈసీఐఎల్ ప్రాంతంలో 300 చదరపు గజాల స్థలంలో నిర్మించిన ఒక మూడంతస్తుల భవనం, ఇబ్రహీంపట్నం మండలంలో ఒక బహిరంగ ప్లాటు మరియు ఒక ఎకరం వాణిజ్య భూమి, పరిగి మండలంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి మరియు ఈత కొలను కలిగి ఉన్న ఒక ఫామ్హౌస్, 1.2 కిలోల బంగారు ఆభరణాలు; నాలుగు చక్రాల వాహనాలు – 3 (ఫార్చ్యూనర్, వోల్వో, వోక్స్వ్యాగన్); నగదు – ₹9,00,000/-. గుర్తించబడిన ఆస్తుల మొత్తం (దస్తావేజు విలువ ప్రకారం) విలువ రూ.7,83,35,302/-, అదే విధంగా, వీరికి ‘ఏఆర్కే స్పిరిట్స్’ పేరుతో మద్యం వ్యాపారంలో సుమారు ₹80 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు, అలాగే తన భార్య మరియు పిల్లల పేర్లపై రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు కూడా గుర్తించారు.అదనపు ఆస్తులపై విచారణ ఇంకా కొనసాగుతోంది. కేసు దర్యాప్తు లో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతిని రోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలన్నారు అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునన్నారు.ఫిర్యాదుధారుల/బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునన్నారు.








