10,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడ్డ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మొహమ్మద్
జయ కేతనం న్యూస్
నల్గొండజిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ను 10,000/- ను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మిర్యాలగూడ బస్టాండ్ను వేదికగా చేసుకుని బాధితుడిని రూ. 10,000 లంచం డిమాండ్ చేసిన ఇన్స్పెక్టర్, బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ముందస్తు వ్యూహంతో నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని మందులవారి కాలనీలో ఉన్న అతని నివాసంలోనూ సోదాలు చేపట్టారు. అలాగే నల్లగొండలోని నివాసంలోనూ ఏసీబీ బృందం తనిఖీలు చేపట్టింది.








