అజ్ఞాతంలోకి నటి కస్తూరి

తెలుగువారిని కించపరిచే విధంగా మాట్లాడారనే ఫిర్యాదులతో టీవీ నటి కస్తూరిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఆమె అరెస్టు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎక్కడున్నా అరెస్టుకు సమన్లు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం ఎక్కడుందనేది తెలియడం లేదు. సెల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ ఉంటూ వచ్చింది. చెన్నైలోని ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. ఆంధ్ర ప్రాంతం నుంచి శతాబ్దాల క్రితం తెలుగువారు తమిళనాడులో రాజుల వద్ద అంతఃపుర కాంతలకు సేవ చేయడానికి కూలీలుగా వచ్చారని మాటల సందర్భంలో కస్తూరి వ్యాఖ్యానించారనేది వివాదాస్పదం అయింది. అయితే తెలుగువారిని తాను కించపర్చలేదని, నొప్పించి ఉంటే క్షమించాలని కూడా కస్తూరి తరఫున తరువాత ప్రకటన వెలువడింది. ఇప్పుడు ఆమె అరెస్టుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగడం, ఆమె అజ్ఞాతంలోకి వెళ్లడం కీలక చర్చకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్