నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్-2025 అందుకున్న డా.బయ్యారపు సురేందర్ వర్మ

నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్-2025 అందుకున్న డా.బయ్యారపు సురేందర్ వర్మ

జయకేతనం న్యూస్ అక్టోబర్ 9

ప్రతిష్టాత్మకమైన నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు-2025 ను ప్రఖ్యాత సంస్థ అయిన ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్(ఏఐసిఎఫ్) ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా కీసర మండలం గోధుమ కుంట గ్రామం లోని యూకే బీఎడ్ కళాశాల నందు ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న బయ్యారపు సురేందర్ వర్మను ఎంపిక చేసింది. ఈ అవార్డు అక్టోబర్ 7న సురేంద్ర వర్మఅందుకోవటం పట్ల కళాశాల యాజమాన్యం డైరెక్టర్ ఉదయ్ కుమార్ కరస్పాండెంట్ డాక్టర్ విద్య స్రవంతి ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు డాక్టర్ బయ్యారపు సురేందర్ వర్మ 2007 సంవత్సరం నుండి లెక్చరర్ గా పనిచేస్తూ 2015 లో ప్రిన్సిపల్ గా పదోన్నతి పొంది విద్యా విధానంలో తన వంతు పాత్ర పోషిస్తూ వందలాదిమంది ఛాత్రోపాధ్యాయులను ఈ సమాజానికి అందిస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దుటలో అలుపెరగని కృషి చేసినందుకు గాను నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ కు ఎంపిక కావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ లో డాక్టరేట్ పొంది నేషనల్, ఇంటర్నేషనల్,సెమినార్స్ లో పాల్గొని గణిత బోధన పద్ధతి లు పుస్తకాలను రచించి బోధన వృత్తి ద్వారా సమాజ శ్రేయస్సు పట్ల తన కృషిని గుర్తించి ఏఐసిఎఫ్ అవార్డును ప్రధానం చేయడం జరిగింది ఈ సందర్భంగావిద్యావంతులు మేధావులు రీసెర్చ్ స్కాలర్స్ ఏఐసిఎఫ్ ఫౌండర్ విజయ రాజు గద్దపాటి ని అభినందించడం జరిగింది ఈ అభినందన సభలో తన మిత్రులు పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగిందిఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి. గదరాజు చందు, డాక్టర్ ఎన్ పీ. వీరస్వామి, శనిగరపు బాలకృష్ణ,అభిజిత్, సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి లాలూ ప్రసాద్, బోరెల్లి సురేష్ కూరెళ్ళ మహేష్ బాబు, సైదులు, తెలంగాణ పత్రిక సూర్యాపేట జిల్లా బ్యూరో భయ్యారపు రవీంద్ర మొదలగు వారు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్