ఆలయ ప్రాంగణాలలో రాజకీయ, సామాజిక,ఆధ్యాత్మిక ఫ్లెక్సీలకు అనుమతి లేదు. జాతరలో డిజేల నిర్వహణకు పూర్తి నిషేదం సిఐ చరమందరాజు

జయకేతనం న్యూస్
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో త్వరలో జరగనున్న ముత్యాలమ్మ జాతర ప్రశాంతంగా జరుపుకోవడానికి పట్టణ ప్రజలంతా సహకరించాలని సిఐ చరమందరాజు కోరారు.సోమవారం హుజూర్ నగర్ సిఐ కార్యాలయంలో ముత్యాలమ్మ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 17,18 తేదీలలో జరుగు ముత్యాలమ్మ జాతర 21 వ తేదీన జరగనున్న కనదుర్గమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గత ఏడాది మాదిరిగా ప్రణాళిక బద్దంగా జాతరనిర్వహించాలని సూచించారు అదే విధంగా రెండు ముత్యాలమ్మ ఆలయాలు,కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణాలలో ఎటువంటి రాజకీయ,సామాజిక,ఆధ్యాత్మిక సంబందింత ఫ్లెక్సీలు పెట్టరాదన్నారు.జాతరలో డిజేలకు అనుమతి లేదన్నారు.జాతర కావలసిన బందోబస్తును ఏర్పాటు చేస్తామని కమిటి సభ్యులకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్