జయకేతనం న్యూస్ ఆగస్టు 24
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల మాంసపు దుకాణాలను కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.పెంటయ్య,వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మేరిగ అశోక్ తో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. హుజూర్ నగర్ పట్టణంలో గొర్రెలు మేకలు పశువులు పంది చేపల మాంసం విక్రయించు దుకాణాలు 40 వున్నట్లుగా గుర్తించగా అట్టి దుకాణాలలో తనిఖీలు నిర్వహించగా 16 దుకాణాలు మార్కెట్లలో మాంసం విక్రయిస్తున్నారని, 03 దుకాణాలలో ఇండ్ల మధ్యలో మాంసం విక్రయిస్తుండగా 21 దుకాణాలు రోడ్ల పైన మాంసం విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు.ఇట్టి సమగ్ర రిపోర్టుని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు వారు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ జవాన్లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు









