
20,000/- తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నర్వ హర్షవర్ధన్ రెడ్డి
ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు 40,000/- లంచం డిమాండ్
జయకేతనం న్యూస్ నవంబర్ 18
ఫిర్యాదుధారుని బంధువుకి చెందిన వ్యవసాయ క్షేత్రాల్లో డిటిఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్)మంజూరు చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.40,000/- లంచం డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.20,000/- తీసుకుంటూ టిజిఎస్పిడిసిఎల్ వనపర్తి సర్కిల్ అండ్ డివిజన్లోని గోపాల్పేట సెక్షన్,సహాయక ఇంజనీరు(ఆపరేషన్స్) -నర్వ హర్షవర్ధన్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు









