ఖమ్మం జిల్లా తల్లాడ తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు
రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ దొరికిపోయిన తహశీల్దార్ సురేష్ కుమార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ మాలోత్ భాస్కర్ ,డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్
జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 18
ఖమ్మం జిల్లా, తల్లాడ మండల తహశీల్దార్ కార్యాలయంలోని తహసీల్దార్-వంకాయల సురేష్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్-మాలోత్ భాస్కర్ రావు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్-శివాజీ రాథోడ్ లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు ఫిర్యాదుధారుడు కొనుక్కున్న భూమిని ఆయన పేరుమీద రిజిస్టర్ చేసేందుకు మరియు దాన్ని ప్రాసెస్ చేసేందుకు ” అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.10,000/- లంచం తీసుకుంటుండగా పథకం ప్రకారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణఅవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.









