ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడానికి 15000/-డిమాండ్ చేసిన లైన్ మెన్
లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ తోట నాగేంద్ర
జయకేతనం న్యూస్ అక్టోబర్ 14
ఫిర్యాదుధారునికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఒక ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడానికి”ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/-లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంకు చెందిన మాచినోనిపల్లి గ్రామ TGSPDCL లైన్ మెన్ – తోట నాగేంద్ర.
పట్టుబడ్డాడు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునని “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు









