బంధన్ బ్యాంక్‌ బీమా చెక్కు అందజేత

 

జయకేతనం న్యూస్ ఆగస్టు 25

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన బత్తుల రమాదేవి ఇటీవల సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని బంధన్ బ్యాంక్ లో
లోన్ తీసుకున్నారు. అయితే ఆమె దురదృష్టవశాత్తు గత నెలలో ప్రమాదవశాత్తు మరణించారు. లోన్ సమయంలో బ్యాంకు మేనేజర్ ఆమెకు బీమా సౌకర్యం కల్పించడంతో ఆ బీమా కింద లభించిన రూ.1,00,000 మొత్తాన్ని ఏరియా మేనేజర్ హరీష్ ఆదేశాల మేరకు, హుజూర్ నగర్ బంధన్ బ్యాంక్ మేనేజర్ నవీన్ కుమార్ ఆమె భర్త (నామిని)కు అందజేశారు.
ఈ సందర్భంగా మేనేజర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, బంధన్ బ్యాంక్‌లో లోన్ తీసుకునే ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అలాగే సిబిల్ స్కోర్ ప్రాముఖ్యతను వివరించారు. FD, RD సేవలతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PMJDY, PMJJBY, PMSBY వంటి పథకాలను వినియోగించుకోవాలని కోరారు. అధనంగా ప్రతి ఖాతాదారికి నూతనంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్