

జయకేతనం న్యూస్ ఆగస్టు 13
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాల ప్రవేశ పరీక్షలో భాగంగా హకీంపేట్, కరీంనగర్, అదిలాబాద్ నాలుగో తరగతి ప్రవేశానికి విద్యార్థిని, విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి ఎంపిక విధానంలో భాగంగా నిర్వహించిన అర్హత పరీక్షలలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన పలువురు విద్యార్ధులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 320 మంది విద్యార్ధులు ఈ పరీక్షలలో పోటీ పడగా సూర్యాపేట జిల్లా నుంచి మొదటి దశలోనే అర్హత పొందడం జరిగింది.రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలలో విజయం సాధించిన కోలపూడి శ్రీమాన్, పంగ శ్యామ్ కుమార్, కోలపూడి తమన్ లుపలువురు విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.వీరిని పలువురు పట్టణ ప్రజలు అభినందిస్తూ రాష్ట్ర స్థాయిలో హుజూర్ నగర్ పట్టణాన్ని మొదటి స్థాయిలో నిలిపి వారి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది









