రూ.75000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బందెల వరప్రసాద్, సహాయకుడు వడాల వంశీ కృష్ణ
జయకేతనం న్యూస్ నవంబర్ 13
జీ+4 భవనాన్ని నిర్మించుకోవడానికి కావలసిన అనుమతి కోసం ప్రక్రియను ప్రాసెస్ చేసి, అనుమతిని జారీ చేయడానికి” ఫిర్యాదుధారుని నుండి రూ.75,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం, ఆదిబట్ల పురపాలక సంఘంలోని పట్టణ ప్రణాళిక అధికారి బందెల వరప్రసాద్ మరియు అతని సహాయకుడు వడాల వంశీ కృష్ణ లు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు.









