రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సహకార సంఘాల డిప్యూటీ రిజిస్టర్
7 లక్షల లంచం డిమాండ్ చేయగా 5 లక్షలకు ఒప్పందం చేసుకొని మొదటి వేడుకగా రెండు లక్షలు అందుకున్న రిజిస్టర్
జయకేతనం న్యూస్ అక్టోబర్ 25
మంచిర్యాల జిల్లా మరియు కుమ్రంభీం ఆసిఫాబాద్ (FAC) సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్ / జిల్లా సహకార అధికారి – రాథోడ్ భిక్కు ఫిర్యాదుధారున్ని సస్పెన్షన్ నుండి పున:నియమించడానికి కమిటీకి సానుకూల నివేదికను పంపడానికి, తన జీతం స్థిరీకరణకు సంబంధించిన G.O. నెం.44ను అమలు చేసి పెండింగ్లో ఉన్న పెరిగిన జీతాల బిల్లులను సిద్ధం చేయడానికి, సస్పెన్షన్ కాలపు జీతభత్యాలను చెల్లించడానికి మరియు తన పైన విచారణ జరుపబడి ఇవ్వబడిన నివేదికపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఉండేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.7,00,000/-లంచం డిమాండ్ చేసి, అభ్యర్థన మేరకు రూ.5,00,000/-కు తగ్గించి, అందులోనుండి మొదటి విడతగా రూ.2,00,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.









