స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వ్యాస రచన పోటీలు. స్పోకెన్ ఇంగ్లీష్ టైనర్, సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్

జయకేతనం న్యూస్ ఆగస్టు 14

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వ్యాస రచన పోటీలను నిర్వహించనున్నట్టు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్,సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ పేర్కొన్నారు.6నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని ప్రకటించారు. “భారత స్వాతంత్ర్య సముపార్జన సాధనలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పాత్ర”(ద రోల్ ఆఫ్ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఆన్ అటెయినింగ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియా)”అంశంపై ఆరు ఏ-4 సైజ్ పేపర్ లకు మించకుండా ఇంటి వద్ద నుంచి లేదా ఉపాధ్యాయుల సమక్షంలో వ్యాసం రాసి తమకు పంపాలని కోరారు. ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. వ్యాసాలు రాసిన అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్/ సంబంధిత తరగతి ఉపాధ్యాయుడు/ తల్లిదండ్రులచే ధ్రువీకరణ చేయించుకున్న వ్యాసాలను న్యూ మున్సిపల్ కాంప్లెక్స్ లో డైమండ్ బేకరీ పక్కన ఉన్న ఎం.ఎస్. మొబైల్స్ లో ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 7 గంటల లోపు అందజేయాలని కోరారు. వ్యాసం రాసిన పేపర్ పై భాగంపై పేరు, తండ్రి పేరు, తరగతి, ఫోన్ నెంబర్, స్కూల్ పేరు, పాఠశాల నెంబర్ కచ్చితంగా రాయాలని కోరారు. ఉత్తమ వ్యాసాలను అందించిన విద్యార్థులకు జ్ఞాపికలు,పతకాలను అందజేయనున్నట్టు హమీద్ షేక్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్