ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ కి ఎంపికైన VVM విద్యార్థి
జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 18
సూర్యాపేట జిల్లా మోతే మండలం నామారం లో బుధవారం జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ లో హుజూర్ నగర్ డివిజన్ కెప్టెన్ గా మంచి ప్రతిభ చాటి విజేతగా నిలిచిన జట్టు నుండి విజయ విద్యా మందిర్ హైస్కూల్ (VVM) లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి వెంకట్ ఉమ్మడి నల్గొండ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక అవ్వడం పట్ల వీవీఎం హెడ్ మాస్టర్ సిస్టర్ అనిత, పిఈటి శ్రీకాంత్ రెడ్డి,ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు విద్యార్థి వెంకట్ ను అభినందించారు









