ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహణ
జయకేతనం న్యూస్ డిసెంబర్ 03
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఐ ఈ ఆర్ పి బి. నాగమణి అధ్యక్షతన పాలకీడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవిత సెంటర్ నందు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది.వచ్చిన విద్యార్థులకు భోజన వసతి కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తహశీల్దార్ కమలాకర్ దివ్యాంగులను ఉద్దేశించి పలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజయ్య రేష్మ బేగం, ఎం.శ్రీనివాస్ రెడ్డి, బి.పూల, సిహెచ్.కిరణ్ కుమార్,
జి.తిరుపతయ్య, జి.లక్పతి కె.సుభాషిని సీఆర్పీలు బి.మాంగ్తనాయక్ ఎస్ వెంకటేశ్వర్లు మరియు తదితరులు పాల్గొని దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా విజయవంతం చేయడం జరిగింది.









