10,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ సుభా కామేశ్వరి
జయకేతనం న్యూస్ డిసెంబర్ 18
ఫిర్యాదుధారుని తాత నుండి తండ్రి పేరు మీదకు భూరికార్డుల మార్పిడి ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాన్ని పరిశీలించి ధృవీకరించి పై అధికారులకు పంపడానికి ఫిర్యాదుధారున్ని ఖమ్మం జిల్లా,కారేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయములోని ఆర్ ఐ వూస సుభా కామేశ్వరి రూ.10,000/- డిమాండ్ చేయడంతో లంచం ఇవ్వడానికి ఇష్టపడని ఫిర్యాదు దారుడు ఏసీబీ ని ఆశ్రయించాడు ఏసీబీ డిఎస్పీ వై.రమేష్ ఆర్ ఐ సుభా కామేశ్వరి ని 10,000/-లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునన్నారు.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని తెలిపారు.









